ఆయుర్వేదం

అజీర్ణం:

1. కరక్కాయ చూర్ణం , సైంధవ లవణం సమ భాగములుగా కలుపుకుని పూట కి 3 గ్రాముల చొప్పున ఉదయం,

     సాయంత్రం భోజనం తర్వాత తీసుకొంటే అన్ని అజీర్ణ రోగాలు పోతాయి.

2. పచ్చి అరటి కాయ ను ముక్కలు కోసి ఎండించి పొడిచేసి 1 నుండి 2 గ్రాముల పొడిని కొద్దిగా ఉప్పు కలిపి  

   సేవించిన అజీర్ణం తగ్గిపోవును .

ఉబ్బసం (ఆస్తమా):

1 . కుంకుడు గింజలోని పప్పు ప్రతి రోజు తిన్న ఉబ్బస వ్యాధి నిరోదిన్చబడుతుంది .

2. పరిశుద్దమైన వేప నూనె 5 నుండి 10 చుక్కలు తమల పాకులో వేసుకొని రోజు కి రెండు సార్లు తినిన ఉబ్బసం  

     తగ్గిపోతుంది .

కడుపు ఉబ్బరం (గ్యాస్ ):

ఒక గ్రాము  సైంధవ లవణం , 5 గ్రాముల అల్లము కలిపి ప్రతి రోజు ఉదయం , సాయంత్రం సేవిస్తే కడుపుబ్బరం

తగ్గును .

కాలిన గాయము లకు :

నేరేడు ఆకులను ముద్దగా నూరి 100 గ్రాముల ముద్దని , 500 గ్రాముల ఆవాల నునె లో వేయించి ఈ తైలము ని కాలిన గాయంలపై రాస్తుంటే సులభంగా మానిపోతాయి



No comments:

Post a Comment