Saturday, October 18, 2014

ఒత్తిడి తగ్గించే ఆహార పదార్థాలు

అధిక రక్తపోటు... మధుమేహం... పక్షవాతం... స్థూలకాయం... పొగతాగడం...సోమరితనం...ఉప్పు ఎక్కువగా తీసుకోవడం...దీర్ఘకాలిక ఒత్తిడులు...నిద్ర పట్టకపోవడం... లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వీటి తగ్గుదల కోసం కొన్ని ఆహార చిట్కాలు పాటించి చూడండి!

1. బిపి 110-70 ఉంటుందా? అయితే ప్రతిరోజూ ఆహారంలో గుడ్డులోని తెల్లని భాగాన్ని చేర్చుకోండి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. అంతేకాక, అది ఆరోగ్యాన్నీ కాపాడుతుంది.

2.  వృక్ష సంబంధమైన ఆహారంలో ఉండే ప్రొటీన్లు లభించే బ్రకోలి, బీన్స్‌, బ్రౌన్‌ రైస్‌, ఓట్‌మీల్‌ లాంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి కావలసిన ప్రొటీన్లను అందించగలుగుతార.

3. సోయా ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల పనితీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలోని సోడియం స్థాయిల్ని సమతుల్యం చేస్తుంది.

4.  వారంలో రెండు,మూడుసార్లు ఆహారంలో ఆకుకూరల్ని చేర్చడంతో కాల్షియం, పీచు పదార్థాలు కావల్సినంత అందుతాయి.

5.  రక్తనాళాల వాపు తగ్గించడానికి చురుకుదనాన్ని పెంచడానికి చాక్లెట్‌లు ఎంతో ఉపయోగపడతాయి. అలాగని ఎక్కువగా తీసుకోకూడదు. 30కేలరీల శక్తినిచ్చే వరకూ తీసుకోవచ్చు. దీనితో పాటు నిత్యం వాడే మాత్రలను మరచిపోకండి.

6. వీటన్నింటినీ పాటిస్తూనే రోజూ 30 నిమిషాల నడక ఆరోగ్యానికి ఎంతో మంచిది.

7. శాచ్యురేటెడ్‌ కొవ్వులు, చక్కెర, చక్కెర సిరప్‌లను 100శాతం తృణధాన్యాలను ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తపోటు, ఒత్తిడుల నుండి దూరంగా ఉండవచ్చు.

Thursday, October 16, 2014

ముఖం పై నలుపు తగ్గించే టమాటో ..tomato for face pack.

1. తాజా టమాటో  మద్య లో కోసి ఆ ముక్కని పంచదార లో అద్దాలి . దాని పై కొద్దిగా చిక్కని పెరుగు వేసి , దాంతో ముఖం రాసుకుంటే మృత కణాలు తొలిగిపోతాయి . ముఖం పై నలుపు నెమ్మది గా తగ్గిపోతుంది .

2. ఒక ముక్క టమాటో  రసం , ఒక ముక్క నిమ్మరసం కొద్ది గా పెరుగు కలిపి మిశ్రమం లా చేసుకోవాలి . మరీ పల్చగా ఉంటె శనగపిండి కాని ముల్తానీ మట్టి కాని కలిపి చిక్క గా చేసుకోవచ్చు . ఈ మిశ్రమాన్ని ముఖం , మెడ వంపు ల్లో ప్యాక్ లా రాసుకోవాలి .  ఇలా వారం లో రెండు సార్లు చేస్తే ట్యాన్ తోలిగిపోతుంది . చర్మం తాజా గా మారతుంది . మొటిమల సమస్య తగ్గుతుంది .

3. ఒక ముక్క టమాటో  రసానికి చెంచ కోతిమీర రసం కలిపి , దానికి కొంచం ముల్తాని మట్టి కలిపి ముఖాని కి ప్యాక్ వేసుకోవాలి . ఆరిన తరవాత కడిగేస్తే మంచి గ్లో వస్తుంది

Saturday, October 11, 2014

బాదంతో అందం

- రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడిని పాలల్లో వేసి కలపాలి. చిక్కటి పేస్ట్‌లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి.
 ఈ పేస్ట్‌ను నిద్రపోయే ముందు ముఖానికి ఐప్లె చేయాలి. 10-15నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

-ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్‌లో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
-బాదంను నీళ్ళలో నానబెట్టి తర్వాత రోజు ఉదయం వాటి పొట్టు తీసి గ్రైండ్ చేయాలి. దాంట్లో తేనె మిక్స్ చేసి ముఖానికి, శరీరానికి పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె మిక్స్ చేయడం వల్ల ముఖంలో ఏర్పడ్డ మచ్చలు చాలా తేలికగా తొలగిపోతాయి.

-మెత్తగా పౌడర్ చేసిన ఓట్స్‌కు కొద్దిగా బాదం పొడి, రెండు టీస్పూన్ల పచ్చిపాలు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ కలిగిన వారికి ఈ ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది.
-బాదం నూనెను ముఖానికి, శరీరానికి పట్టించి మసాజ్ చేయాలి. అరగంట అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి.

బ్లాక్‌హెడ్స్‌కి ...health tips for black heads


1. ముల్లంగి విత్తనాలను పేస్ట్‌లా చేసి ముఖానికి రాయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 

2. చందనంలో రోజ్‌వాటర్ కలిపి ముఖానికి ఐప్లె చేసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడగాలి.

3. బేకింగ్‌సోడాకు, డెడ్‌సీ సాల్ట్, వాటర్ కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీంతో చర్మంపై రుద్దితే మంచి ఫలితం ఉంటుంది.

4. ఓట్‌మీల్ పౌడర్‌కు రోజ్‌వాటర్ కలుపుకొని ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని 
నీటితో కడుక్కుంటే సరిపోతుంది.

5. మెంతి ఆకులను పేస్ట్ చేసుకొని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగాలి. ఇలా తరచుగా చేస్తే బ్లాక్‌హెడ్స్ తగ్గిపోతాయి.

6. పెరుగులో నల్లమిరియాల పొడివేసి, బాగా కలిపి ముఖానికి రాయాలి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి.

7. దాల్చినచెక్క పొడి, నిమ్మరసం పేస్ట్‌ను రాత్రి బ్లాక్‌హెడ్స్‌పై రాసి ఉదయాన్నే కడిగేస్తే సరి!

ఇలా చేస్తే 80 శాతం మీ గుండె సేఫ్! health tips for heart

ఆధునిక జీవనశైలితో కంప్యూటర్లకు అతుక్కుపోవడంలో బిజీ ఉన్నప్పటికీ పనిచేసే చోట కూడా ఆరోగ్యకరమైన జీవనశైలిని కల్పించుకోవచ్చు. గుండెజబ్బులను నివారించాలంటే శారీరక శ్రమ అన్నది అత్యంత ముఖ్యమైన అంశo 
80 శాతం రిస్క్ తగ్గే మార్గం!

జాగ్రత్తలు - సూచనలు

-ప్రపంచవ్యాప్తంగా పొగాకును నిషేధించాలి. పొగాకు సంబంధిత అలవాట్లయిన సిగరెట్లు, బీడీలు, గుట్కాల వంటి అలవాట్లు లేకపోతే గుండెపోట్ల అవకాశాలను 36 శాతం తగ్గించుకోవచ్చు. 
-వారానికి కనీసం 5 రోజులన్నా తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. రోజుకి కనీసం 40 నిమిషాల పాటైనా వ్యాయామం చేస్తే గుండెపోటు అవకాశం 3 శాతం వరకు తగ్గుతుంది. సాధారణ వాకింగ్ అయినా చేయవచ్చు.



-స్థూలకాయం గుండెజబ్బులకు ప్రధాన శత్రువు. అందుకే నడుము చుట్టుకొలత 37 అంగుళాల కన్నా తక్కువ ఉంచుకోగలిగితే 12 శాతం రిస్కు తగ్గుతుంది. 
-కూరగాయలు, పండ్లు, గింజలు, ముడి ధాన్యాలు, చేపలను తీసుకుంటే 18 శాతం అవకాశాలు తగ్గుతాయి. చేపలు తప్ప ఇతర మాంసాహారాన్ని తగ్గించాలి. 
-రోజుకి కేవలం 2 పెగ్గులు మాత్రమే ఆల్కహాల్ తీసుకుంటే రిస్కు 11 శాతం తగ్గుతుంది. కాని మనదేశంలో 2008లో జరిగిన ఇంటర్ హార్ట్ అధ్యయనంలో ఆల్కహాల్ వల్ల పెద్దగా లాభం ఉండకపోవచ్చని కూడా తెలిసింది. ఇదేకాకుండా ఈ ఆల్కహాల్ మొదలుపెడితే రెండు పెగ్గులతో ఆగకుండా దానికి పూర్తిగా బానిసలయ్యే ఉంది కాబట్టి తీసుకోకపోవడమే మంచిది. 


పొద్దున్నే గుండెపోట్లు ఎందుకు?

నిద్రలోనే చనిపోయారనో, తెల్లవారుజామునే గుండెపోటు వచ్చిందనో అన్న మాటల్ని వింటూనే ఉంటాం. నిజమే ఉదయాన్నే గుండెపోట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా పొద్దున 4 నుంచి 8 గంటల మధ్య ఎక్కువమందిలో గుండెపోటు రావడం చూస్తుంటాం. ఈ సమయంలో శరీర పరిస్థితులు కూడా గుండెపోటు అవకాశాన్ని పెంచుతాయి. బయలాజికల్ సైకిల్‌లో భాగంగా ఈ సమయంలో శరీరంలోని హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. రక్తాన్ని గడ్డ కట్టించే కారకాలు (క్లాటింగ్ ఫ్యాక్టర్స్), ప్లేట్‌లెట్లు మందంగా అవుతాయి. కాబట్టి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి రక్తప్రసారానికి అంతరాయం కలిగే అవకాశాలు ఎక్కువ. రసాయనాలు అసమతుల్యత ఎక్కువ. బీపీ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ సమయంలో గుండెపోటుకు గురయ్యే రిస్కు ఎక్కువ అవుతుంది. అందుకే బీపీ, కొలెస్ట్రాల్, స్టాటిన్స్ మందులు రాత్రిపూట మర్చిపోకుండా తప్పనిసరిగా వేసుకోవాలి. 


గుండెపోటు వస్తే..?

గుండెపోటు వచ్చినప్పుడు ఆందోళన పడకుండా అందుకు ఏం చేయాలన్నది ఆలోచించడం అన్నింటి కన్నా ముఖ్య విషయం. ఆందోళన పడితే సమస్య మరింత జటిలం అవుతుంది. అందువల్ల గుండెపోటు వచ్చిన మొదటి గంట లోపే డాక్టర్‌ను కలవడం అవసరం. పేషెంటు స్థితిని బట్టి ఆస్ప్రిన్, స్టాటిన్ లాంటి మందును ఇస్తారు. అలాగని ఇంటి దగ్గరే ఏ ఆస్ప్రిన్‌నో వేసుకునే ప్రయత్నం చేయవద్దు. కొందరిలో ఇది తీవ్రమైన దుష్ప్రభావాలు చూపించే ప్రమాదం ఉంది. అత్యవసర పరిస్థితిలో సార్బిట్రేట్ నాలుక కింద పెట్టుకుంటే వెంటనే రక్తనాళాలు కొంచెం తెరుచుకుని రక్తప్రసరణ జరుగుతుంది. అయితే అది కచ్చితంగా గుండెపోటు అని తెలిసినప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. లేకుంటే దీనివల్ల కూడా దుష్ప్రభావాలు ఉంటాయి. స్పృహ తప్పొచ్చు కూడా. అందువల్ల వీలైనంత తొందరగా వైద్య సహాయం తీసుకోవడం తప్పనిసరి.




క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ..health tips to avoid cancer

ఆధునిక జీవనశైలి కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ప్రేరేపిస్తుందనడం వాస్తవం. అందుకే మన అలవాట్లు, ఆహార విధానాలు మార్చుకుంటే క్యాన్సర్ రాకుండా కొంతవరకు నివారించవచ్చు. అందుకే మీరు క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఈ అయిదు రకాల పదార్థాలకు దూరంగా ఉండమని సూచిస్తున్నారు నిపుణులు.


1. ప్రాసెస్ చేసిన పదార్థాలు 

అందమైన కవర్లలో ప్యాక్ చేసి ఆకర్షణీయంగా కనిపించే రెడీమేడ్ ఆహార పదార్థాలు తీసుకోవడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో కృత్రిమ రంగులు, రసాయనాలతో తయారు చేసిన ఫ్లేవర్లు, ఉప్పు, చక్కెర, కృత్రిమ చక్కెర పదార్థాల లాంటివి ఎన్నో కలుపుతారు. ఉప్పు ఎక్కువగా ఉన్నవి, ఊరేసినవి, నిలవ చేసిన పదార్థాల వల్ల జీర్ణకోశ క్యాన్సర్ అవకాశాలు పెరుగుతాయి. కేవలం ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలే జీర్ణకోశ క్యాన్సర్ అవకాశాన్ని 10 శాతం పెంచుతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కృత్రిమ రంగులు, అడిటివ్స్ కూడా హానికరమేనని తేలింది. 


2. రెడ్‌మీట్, ప్రాసెస్ చేసిన మాంసం 

రెడ్‌మీట్ ఎక్కువగా తినేవారిలో పెద్దపేగు, జీర్ణకోశ క్యాన్సర్ల అవకాశం ఎక్కువ. ప్రాసెస్ చేసి రెడీ టు ఈట్ గా తయారుచేసిన మాంసాహారంలో సోడియం నైట్రైట్, సోడియం నైట్రేట్‌లు ఉంటాయి. ఇవి న్రైటొసమీన్స్‌గా మారి క్యాన్సర్ అవకాశాన్ని పెంచుతాయని ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో తేలింది. రోడ్డుమీద కాల్చి అమ్మే మాంసాహార పదార్థాలు కూడా తినకూడదు. 


3.చక్కెర 

చక్కెర వల్ల క్యాన్సర్ కణాలు వేగంగా పెరుగుతాయని అంటుంటారు. అందుకే క్యాన్సర్ పేషెంట్లు తియ్యగా ఉంటాయని పండ్లు కూడా తినక అవసరమైన పోషకాలను పొందలేరు. నిజానికి దీనికి స్పష్టమైన రుజువులేమీ లేవు. అయితే చక్కెర పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కేలరీలు పెరిగి ఊబకాయం తద్వారా హార్మోన్లలో తేడాలు వస్తాయి. ఫలితంగా రొమ్ము, పెద్దపేగు, గర్భసంచి క్యాన్సర్ల అవకాశాలుంటాయి


4. వేపుళ్లు, చిప్స్

చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు. ఇలాంటి స్నాక్స్‌లో అక్రిలమైడ్ అనే క్యాన్సర్ కారకం ఉంటుంది. ఎక్కువ ఉష్ణోగ్రతల్లో (250 డిగ్రీ ఫారన్‌హీట్) వేడిచేసినప్పుడు అంటే వేపుడు, బేకింగ్ లాంటివి చేసినప్పుడు ఆహారపదార్థాల నుంచి ఇది తయారవుతుంది. దీర్ఘకాలం పాటు అక్రిలమైడ్‌కి ప్రభావితం కావడం వల్ల ఎలుకల్లో కణుతులు ఏర్పడినట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఇటువంటి ఆహార పదార్థాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ ఆమ్లాలు గుండెజబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌ల అవకాశం పెంచడంతో పాటు క్యాన్సర్ కారకాలు కూడా. 


5. ఆల్కహాల్

ఆల్కహాల్ తీసుకోవడానికి క్యాన్సర్‌కి సంబంధం ఉందని అనేక రకాల రుజువులున్నాయి. నోరు, గొంతు, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్లే కాకుండా రొమ్ము క్యాన్సర్‌కి కూడా ఇది దోహదం చేస్తుంది.

నీళ్ళతో ..health tips using water

దాహం వేస్తే నీళ్లు తాగడం కాదు. మన చర్మం, కళ్లు, జుత్తు, గోళ్లు.. ఇలా ఒకటేమిటి..! శరీరంలోని ఏ భాగం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తగినన్ని నీళ్లు తాగాల్సిందే. ఉదయాన్నే గోరువెచ్చని నీరు, నిమ్మరసం తాగితే రోజంతా ఉల్లాసంగా ఉండడమే కాకుండా సవాలక్ష అనారోగ్యాలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. 


డీహైడ్రేషన్


మొటిమలు


నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని హానికర మలినాలన్నీ వెళ్లిపోతాయి కాబట్టి మొటిమల అవకాశం తగ్గుతుంది. 

సన్‌బర్న్


సన్‌బర్న్ బాధల్ని నీరు తగ్గిస్తుంది. నీరసపడిన శరీరానికి పునరుత్తేజాన్నిస్తుంది. 

కళ్ల కింద సంచులు


డీహైడ్రేషన్ వల్ల కంటి కింద ఉండే సున్నితమైన చర్మం దెబ్బతిని సంచుల్లా పెరగడానికి దోహదం చేస్తుంది.

ముక్కు పొడిబారడం

నీళ్లు తగినన్ని తాగితే పొడి వాతావరణంలో కూడా ముక్కు పొడిబారిపోయి, ఎర్రగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. 

హైడ్రేషన్

ఆరోగ్యకరమైన తల (మాడు)

తల మీద అకారణంగా దురద పెడుతూ ఉందంటే తల పైన చర్మం పొడిబారిపోయినట్టే. ఇలాంటప్పుడు నీళ్లు ఇంకా ఎక్కువగా తాగాలి. 

బలమైన జుత్తు, గోళ్లు

సాధారణంగా శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. జుట్టు పొడిబారిపోయినట్టు కనిపిస్తున్నదంటే మీరు తాగుతున్న నీళ్లు సరిపోనట్టే. రోజూ 8 గ్లాసుల నీరు తాగాలి. 

మెరిసే కళ్లు

డీహైడ్రేషన్ వల్ల పొటాషియం ఎలక్ట్రొలైట్స్ మోతాదు తగ్గుతుంది. వీటివల్లనే కళ్లకి కావాల్సిన తేమ అందుతుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా తగినన్ని నీళ్లు తాగితే కళ్లలో మెరుపు వస్తుంది. 

బరువు తగ్గడం

భోజనానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగితే బరువు తగ్గుతారు.

ముడతలు లేని చర్మం

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది. తద్వారా ముడతలు తగ్గుతాయి.

పెదాలు మెరవాలంటే TIPS FOR LIPS

1. రాత్రి నిద్రపోయే ముందు తేనె ని పేదలకి రాసుకోవాలి . ఉదయం లేవగానే మామూలు నీళ్ళతో కడిగేయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే పెదవులు మృదువుగా , గులాబీ రంగు లోకి మారుతాయి

2. నిమ్మ ముక్కతో కాని ఐస్ ముక్కతో కాని పెదాలని  మర్దన చేసిన మంచి ఫలితం ఉంటుంది .

3. బాదం నూనె , ఆముదం కలిపిన మిశ్రమంతో పెదాలని మర్దన చేసిన పెదాల రంగు మారతుంది .

4. 5 నుంచి 6 చుక్కల ఆలివ్ నునె లో ఒక స్పూన్ పంచదార కలిపి పెదాలపై రుద్దాలి .

5. పెట్రోలియం జెల్లీని కాని అలోవెర జెల్లీని కాని పెదాలపై రాసుకుంటే పెదవులు మృదువు గా తయారవుతాయి