1.కీర దోస రసం లేదా గుజ్జు ని మెడ కి రాసుకుని నెమ్మది గా మర్దన చెయ్యాలి. తర్వాత రోజ్ వాటర్ తో తుడిచేయ్యాలి.ఇలా వారానికి ఒకసారి చెయ్యాలి.
2.బంగాళదుంప ముక్కని కాని రసంని కాని మెడ చుట్టూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
3.నిమ్మ రసం ని రోజ్ వాటర్ ని సమపాళ్ళల్లో తీసుకొని రోజు రాత్రి మెడ పై రాసుకొని మర్నాడు ఉదయం కడిగి వేస్తే మెడ పై నలుపు తగ్గుతుంది.
4.కలబంద గుజ్జును మెడకి పట్టించి పావుగంట తర్వాత కడిగేసుకుంటే మెడ పై నలుపు పోతుంది.
5.బాదాం నునె గోరువెచ్చగా చేసి మెడకి మర్దన చేసుకోవాలి.
6.కమల ఫలం తోక్కలపోడిలో పాలు పోసి పేస్టు లా చేసి మెడకి పట్టించి,ఆరిపోయాక కడిగేసుకోవాలి.ఇలా వారానికొకసారి చేస్తే ఫలితం మంచి ఉంటుంది.
No comments:
Post a Comment