- రెండు టేబుల్ స్పూన్ల బాదం పొడిని పాలల్లో వేసి కలపాలి. చిక్కటి పేస్ట్లా తయారయ్యే వరకూ మిక్స్ చేయాలి.
ఈ పేస్ట్ను నిద్రపోయే ముందు ముఖానికి ఐప్లె చేయాలి. 10-15నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ పేస్ట్ను నిద్రపోయే ముందు ముఖానికి ఐప్లె చేయాలి. 10-15నిమిషాలు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
-ఒక టేబుల్ స్పూన్ బాదం పౌడర్లో ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసి కలిపి ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.
-బాదంను నీళ్ళలో నానబెట్టి తర్వాత రోజు ఉదయం వాటి పొట్టు తీసి గ్రైండ్ చేయాలి. దాంట్లో తేనె మిక్స్ చేసి ముఖానికి, శరీరానికి పట్టించాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. తేనె మిక్స్ చేయడం వల్ల ముఖంలో ఏర్పడ్డ మచ్చలు చాలా తేలికగా తొలగిపోతాయి.
-మెత్తగా పౌడర్ చేసిన ఓట్స్కు కొద్దిగా బాదం పొడి, రెండు టీస్పూన్ల పచ్చిపాలు వేసి పేస్ట్లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. డ్రై స్కిన్ కలిగిన వారికి ఈ ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది.
-బాదం నూనెను ముఖానికి, శరీరానికి పట్టించి మసాజ్ చేయాలి. అరగంట అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి.
No comments:
Post a Comment