దాహం వేస్తే నీళ్లు తాగడం కాదు. మన చర్మం, కళ్లు, జుత్తు, గోళ్లు.. ఇలా ఒకటేమిటి..! శరీరంలోని ఏ భాగం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం తగినన్ని నీళ్లు తాగాల్సిందే. ఉదయాన్నే గోరువెచ్చని నీరు, నిమ్మరసం తాగితే రోజంతా ఉల్లాసంగా ఉండడమే కాకుండా సవాలక్ష అనారోగ్యాలు తగ్గుతాయంటున్నారు నిపుణులు.
డీహైడ్రేషన్
మొటిమలు
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలోని హానికర మలినాలన్నీ వెళ్లిపోతాయి కాబట్టి మొటిమల అవకాశం తగ్గుతుంది.
సన్బర్న్
సన్బర్న్ బాధల్ని నీరు తగ్గిస్తుంది. నీరసపడిన శరీరానికి పునరుత్తేజాన్నిస్తుంది.
కళ్ల కింద సంచులు
డీహైడ్రేషన్ వల్ల కంటి కింద ఉండే సున్నితమైన చర్మం దెబ్బతిని సంచుల్లా పెరగడానికి దోహదం చేస్తుంది.
ముక్కు పొడిబారడం
నీళ్లు తగినన్ని తాగితే పొడి వాతావరణంలో కూడా ముక్కు పొడిబారిపోయి, ఎర్రగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.
హైడ్రేషన్
ఆరోగ్యకరమైన తల (మాడు)
తల మీద అకారణంగా దురద పెడుతూ ఉందంటే తల పైన చర్మం పొడిబారిపోయినట్టే. ఇలాంటప్పుడు నీళ్లు ఇంకా ఎక్కువగా తాగాలి.
బలమైన జుత్తు, గోళ్లు
సాధారణంగా శరీరంలో ఎక్కువ శాతం నీరే ఉంటుంది. జుట్టు పొడిబారిపోయినట్టు కనిపిస్తున్నదంటే మీరు తాగుతున్న నీళ్లు సరిపోనట్టే. రోజూ 8 గ్లాసుల నీరు తాగాలి.
మెరిసే కళ్లు
డీహైడ్రేషన్ వల్ల పొటాషియం ఎలక్ట్రొలైట్స్ మోతాదు తగ్గుతుంది. వీటివల్లనే కళ్లకి కావాల్సిన తేమ అందుతుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా తగినన్ని నీళ్లు తాగితే కళ్లలో మెరుపు వస్తుంది.
బరువు తగ్గడం
భోజనానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసుల నీళ్లు తాగితే బరువు తగ్గుతారు.
ముడతలు లేని చర్మం
నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం స్థితిస్థాపకత పెరుగుతుంది. తద్వారా ముడతలు తగ్గుతాయి.
No comments:
Post a Comment